డీపీఓగా రామ్‌నాథ్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

డీపీఓగా రామ్‌నాథ్‌రెడ్డి

Jun 17 2025 7:01 AM | Updated on Jun 17 2025 7:01 AM

డీపీఓ

డీపీఓగా రామ్‌నాథ్‌రెడ్డి

భీమవరం (ప్రకాశంచౌక్‌): పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)గా ఎన్‌.రామ్‌నాథ్‌రెడ్డి, భీమవరం అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ఎ.రాంబాబు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. వీరు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణిని కలిసి పూలమొక్కలు అందించారు. జిల్లాను పరిశుభ్రంగా ఉంచేందుకు, ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

వృద్ధుల ఆస్తులకు రక్షణ కల్పించాలి

భీమవరం: తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలని, ట్రిబ్యునల్‌ తీర్పును కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని జిల్లా వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డాల సత్యనారాయణ, కొటికలపూడి చిట్టి వెంకయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ, అవగాహన దినోత్సవం సందర్భంగా భీమవరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, వృద్ధుల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని, మండలానికి కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసి నిర్వహించాలన్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ నాగరాణికి అందజేశారు. అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ మెంబర్‌ మేళం దుర్గాప్రసాద్‌, మట్లపూడి సత్యనారాయణ, నల్లం వెంకట కృష్ణ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కూటమిలో సోషల్‌ మీడియా చిచ్చు

పెనుగొండ: సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెట్టిన పోస్టులు ఆచంట నియోజకవర్గంలో చిచ్చురేపాయి. జనసేన పార్టీపై ఆక్రోశం వెళ్లగక్కుతూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై పోస్టులు పెట్టి అవహేళన చేస్తుండటంతో జనసేన కార్యకర్తలు రగిపోతున్నారు. అనుచిత పోస్టులపై పోడూరు, ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ పోలీస్‌స్టేషన్లలో సోమవారం ఫిర్యాదు చేశారు. అలాగే పెనుగొండ సర్పంచ్‌ భర్త నక్కా వేదవ్యాస శాస్త్రి, అతడి సోదరుడు శర్మలపై ఆరోపణలు చేస్తూ పోస్టింగ్‌ పెట్టడం వివాదంగా మారింది. దీనిపై మాలమహానాడు నాయకులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ వరకూ ఫిర్యాదులు చేశారు. ఫిర్యా దులు వెల్లువెత్తడంతో ఆ గ్రూపు అడ్మిన్‌ను ఆచంట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేయాలంటూ జనసేన నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ గ్రూపులో సదరు వ్యక్తి మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హై కోర్టు అడ్వకేట్‌ ఇండుగపల్లి రామానుజం, జనసేన నాయకుడు కంబాల బాబులుపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు.

మున్సిపల్‌ కార్మికుల నిరసన

తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోని ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే సమ్మె తప్పదని ఏపీ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభా గపు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పట్టణ నాయకులు హెచ్చరించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద సోమవారం వారు నిరసన తెలిపారు. నాయకులు నూకపల్లి శేఖర్‌, యర్రంశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ చాలాకాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవ డం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హా మీలు నెరవేర్చాలని, వేతనాలు పెంచాలని, బెనిఫిట్స్‌ అందజేయాలని కోరారు. హెడ్‌వాట ర్‌ వర్క్స్‌, అవుట్‌ డోర్‌ వాటర్‌ సప్లయ్‌, ఆ ఫీస్‌ ఎలక్ట్రీిషియన్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఆఫీస్‌, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

డీపీఓగా రామ్‌నాథ్‌రెడ్డి 1
1/2

డీపీఓగా రామ్‌నాథ్‌రెడ్డి

డీపీఓగా రామ్‌నాథ్‌రెడ్డి 2
2/2

డీపీఓగా రామ్‌నాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement