ఫిర్యాదులపై సత్వర చర్యలు
భీమవరం: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో వచ్చిన ఫిర్యాదులపై సమగ్రమైన విచారణ జరిపి సత్వర పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం భీమవరంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరించారు. పలు ప్రాంతాల నుంచి 15 ఫిర్యాదులు అందగా సంబంధిత స్టేషన్ల అధికారులతో ఎస్పీ ఫోన్లో మాట్లాడారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దే శంశెట్టి వెంకటేశ్వరరావు, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ అహ్మదున్నీషా పాల్గొన్నారు.
●మీకో దండం.. తల్లికి వందనం ఇప్పించండి