
ట్రిపుల్ ఐటీ డీన్ స్టూడెంట్ వేల్ఫేర్ అధికారిగా ఎల్
నూజివీడు : స్థానిక ట్రిపుల్ ఐటీ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ (బాలురు) అధికారిగా ఇంగ్లిష్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న ఎల్.రాజేష్ శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఏడాది పాటు ఈ పదవిని ఆయన నిర్వర్తించనున్నారు. అలాగే చీఫ్ వార్డెన్ (బాలురు)గా బి.సురేష్బాబు నియమితులయ్యారు. ఈయన పీయూసీలో బయాలజీ మెంటార్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో తగిన చొరవ చూపాలని రాజేష్కు సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ డీన్ దువ్వూరి శ్రావణి, సెంట్రల్ ఏఓ బండి ప్రసాద్, ఏఓ బి లక్ష్మణరావు, డీన్ సాధు చిరంజీవి, చీఫ్ వార్డెన్ బి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో రాయిపై పడి వ్యక్తి మృతి
కాళ్ల: మద్యం మత్తులో రోడ్డు పక్కన ఉన్న రాయిపై పడిపోవడంతో తీవ్ర గాయమై ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద అమిరంలోని లిబర్టీ ఫ్యాక్టరీ సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన ఎన్.లక్ష్మీకాంత్ (34) భీమవరం పట్టణంలోని బాలాజీ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. అతనికి వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన లక్ష్మీకాంత్ గురువారం రాత్రి మద్యం సేవించి వస్తూ రోడ్డు పక్కన రాయిపై పడిపోవడంతో కనుబొమ్మ వద్ద గాయమై ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో భీమవరం డీఎస్పీ జయసూర్య, ఆకివీడు సీఐ జగదీశ్వరరావు, ఎస్సైలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి మదనాచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించడానికి ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ డైరెక్టర్ ఎం.ఫణి కిషోర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సులో 30 రోజులు, సీసీ కెమెరాల బిగింపుపై 13 రోజుల శిక్షణ ఉంటుందని వివరించారు. ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సుకు 10వ తరగతి ఆపై, సీసీ కెమెరాల బిగింపు కోర్సుకు 5వ తరగతి ఆపై విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరడానికి గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన నిరుద్యోగులు అర్హులని తెలిపారు. శిక్షణ తరగతులు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని వివరించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలకు 99485 65256, 90140 40780 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

ట్రిపుల్ ఐటీ డీన్ స్టూడెంట్ వేల్ఫేర్ అధికారిగా ఎల్