
ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
రామన్నపేట : వరంగల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టీజీఈసెట్–2025 కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్, క్యాంప్ ఆఫీసర్ బైరి ప్రభాకర్ తెలిపారు. మొదటిరోజు 362 మంది విద్యార్థులు హెల్ప్లైన్ సెంటర్ వద్ద పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. అధికారుల పర్యవేక్షణలో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ క్రమబద్ధంగా కొనసాగిందని తెలిపారు.
రైతు భరోసా
రూ.84.01 కోట్లు జమ
హన్మకొండ: వానాకాలం పెట్టుబడి సాయం రైతు భరోసా హనుమకొండ జిల్లాలో మంగళవారం 1,17,028 మంది రైతుల ఖాతాల్లో రూ.84.01 కోట్లు జమ అయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి రవీందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుందని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లాలో..
న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని రైతులకు మంగళవారం వరకు రైతుభరోసా నిధులు రూ.94కోట్ల వరకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఇప్పటివరకు 1,29,542 మంది రైతులకు పెట్టుబడి సాయం జమైనట్లు పేర్కొన్నారు.
వేదపాఠశాలలో
ప్రవేశానికి దరఖాస్తులు
హన్మకొండ కల్చరల్ : వరంగల్ శ్రీభద్రకాళి వేదపాఠశాలలో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ కమిషనర్, దేవాలయం ఈఓ శేషుభారతి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. వేదపాఠశాలలో ప్రవేశానికి విద్యార్థులకు మాతృభాషలో చదవడం, రాయడం వచ్చి, 8నుంచి 12సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉపనయన సంస్కారం, ఉపాకర్మోత్సర్జనము పూర్తయినవారు అర్హులని పేర్కొన్నారు. అలాగే సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞం కంఠస్థమయి ఉండి స్వయంగా అనుష్టానం చేసుకోగల వారు, 10 సంస్కృత శబ్ధములు (7 విభక్తులు) కంఠస్థం అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. వరంగల్లోని శ్రీభద్రకాళి దేవస్థానంలోని వేదపాఠశాల కార్యాలయంలో నేటినుంచి దరఖాస్తులు ఇవ్వనున్నట్లు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను 25వ తేదీవరకు అందజేయాలని కోరారు.
పోలీస్ కీర్తి ప్రతిష్టలకు
భంగం కలిగించొద్దు
వరంగల్ క్రైం: పోలీస్ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. హనుమకొండ, సుబేదారి, ఏనుమాముల పోలీస్స్టేషన్లతోపాటు సీసీఎస్, టాస్క్ఫోర్స్, యాంటీడ్రగ్స్ విభాగాల్లో బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్లు శివకుమార్, రంజిత్, రాఘవేందర్, సత్యనారాయణరెడ్డి, సతీష్లు మంగళవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సీపీ వారికి సూచించారు.
సహితా విద్యా దినోత్సవం
విద్యారణ్యపురి : బడిబాటలో భాగంగా మంగళవారం సహిత విద్యాదినోత్సవాన్ని నిర్వహించగా హనుమకొండ మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. భవిత కేంద్రంలో విద్యార్థులకు కల్పి స్తున్న సదుపాయాలను వివరించారు. భవిత కేంద్రానికి సరఫరా చేసిన రూ.2లక్షల విలువచేసే సామగ్రిని డీఈఓ పరిశీలించారు. జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో ఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి, ఎంఈఓ నెహ్రూ ఉన్నారు.

ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

ఈసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం