
ఫొటో క్యాప్చర్ జరుగుతోందా?
హసన్పర్తి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఫొటో క్యాప్చర్ జరుగుతోందా అని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. అధికారులను ప్రశ్నించారు. పెంబర్తిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం కలెక్టర్ స్వయంగా పరిశీలించి, లబ్ధిదారులతో ముచ్చటించారు. పనులు ఏవిధంగా జరుగుతున్నాయని అడిగారు. రోజువారీగా మేసీ్త్రకి కూలి ఇచ్చి ఇళ్లు నిర్మించుకుంటున్నట్లు లబ్ధిదారులు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దశల వారీగా ఫొటోలు తీయాలని సూచించారు. ఆ మేరకు బిల్లులు కూడా చెల్లింపులు జరుగుతాయని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణశాఖ పీడీ రవీందర్ నాయక్, డీఈఈ సిద్దార్థ నాయక్, నాయబ్ తహసీల్దార్ రహీం, ఎంపీడీఓ కర్ణాకర్, మాజీ సర్పంచ్ పూల, యూత్ కాంగ్రెస్ నాయకుడు చరణ్, కారోబార్ సదానందం పాల్గొన్నారు.
భూభారతితో సమస్యల పరిష్కారం: కలెక్టర్
భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ స్నేహ శబరీష్ పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా సూదన్పల్లిలో నిర్వహించిన సభలో ఆమె పాల్గొన్నారు. స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తెల్లకాగితంపై భూములు కొనుగోలు చేశామని, ఇప్పటివరకు పట్టాదారుగా పేర్లు నమోదు కాలేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏదైనా సమస్య ఉంటే లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన