సంస్కృతిని చాటి చెప్పే శక్తి సాహిత్యానికే ఉంది | - | Sakshi
Sakshi News home page

సంస్కృతిని చాటి చెప్పే శక్తి సాహిత్యానికే ఉంది

Jun 17 2025 4:47 AM | Updated on Jun 17 2025 4:47 AM

సంస్కృతిని చాటి చెప్పే శక్తి సాహిత్యానికే ఉంది

సంస్కృతిని చాటి చెప్పే శక్తి సాహిత్యానికే ఉంది

నర్సంపేట: తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే గొప్ప శక్తి సాహిత్యానికి ఉందని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్‌ పసునూరి రవీందర్‌ అన్నారు. చెన్నారావుపేట మండలంలోని అక్కల్‌చెడ గ్రామానికి చెందిన ప్రముఖ యువ రచయిత, గాయకుడు పడిదం రాజేందర్‌ రాసిన అస్మక రాజ్యమే నా తెలంగాణ అనే గేయ కావ్య పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాచీన చరిత్రను జల్లెడ పట్టి నేటి ఆధునిక వ్యవస్థను వర్ణిస్తూ తనదైన శైలిలో భావవ్యక్తీకరణ తెలియజేసిన గొప్ప రచయిత రాజేందర్‌ అని కొనియాడారు. ఇలాంటి అనేక పాటలు రాసి రాష్ట్రం, దేశంలో గొప్ప కవి,రచయితగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో కవి గాయకుడు డాక్టర్‌ శరత్‌చమర్‌, యోచన, రామంచ భరత్‌, తాళ్ల సునీల్‌, రేలా కుమార్‌, జూపాక శివ, గాదెపాక బాబు, మారముళ్ల ఆనందం, వేదాంత్‌ మౌర్య, జనగాం రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత

డాక్టర్‌ రవీందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement