
పాకాలను అభివృద్ధి చేయాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలను మరింత అభివృద్ధి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. పాకాలలో చేపట్టిన అభివృద్ధి పనులను డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్తో కలిసి మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ పాకాల అద్భుతంగా ఉందని, పర్యాటకంగా తీర్చిదిద్దడానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అనంతరం అభివృద్ధి పనులపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎఫ్ఆర్వో రవికిరణ్, డీఆర్వో రీనా, సెక్షన్, బీట్ అధికారులు పాల్గొన్నారు.
రైతులు ఇబ్బంది పడొద్దు..
భూభారతి సదస్సుల్లో దరఖాస్తులు సమర్పించే రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో భూభారతి రైతు సదస్సును మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా రెండు రోజుల సమయం ఉన్నందున రైతులు సదస్సులకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారులు దరఖాస్తుల స్వీకరణలో నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. కార్యక్రమంలో డీఏఓ అనురాధ, ఇన్చార్జ్ తహసీల్దార్ కృష్ణ, డీటీ రాజారేణుక, అధికారులు పాల్గొన్నారు.