
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయ్కుమార్
కమలాపూర్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయ్కుమార్ సూచించారు. ఎన్సీడీ పీఓ డాక్టర్ సయ్యద్ ఇఫ్తార్ అహ్మద్తో కలిసి కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు సీహెచ్సీ, పీహెచ్సీ పరిసరాలను, ఎన్సీడీ రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై, నేషనల్ హెల్త్ ప్రోగ్రాంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నాగరాజు, వైద్యులు అరుణ్, మానస, సీహెచ్సీ సూపరింటెండెంట్ నరేశ్, ఆర్ఎంఓ వరుణ్, హెచ్ఈఓ రవీందర్, పీహెచ్ఎన్ లీలావతి, హెల్త్ సూపర్వైజర్ అమృత, టీబీ నోడల్ పర్సన్ ప్రభాకర్, స్టాఫ్ నర్సులు సరిత, సంపూర్ణ, ఎల్టీ చంద్రమౌళి, హెల్త్ అసిస్టెంట్స్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంత నిర్లక్ష్యమెందుకు?
వరంగల్ అర్బన్: వాహనాలపై ఇంత నిర్లక్ష్యం తగదని మేయర్ గుండు సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియాకు చెందిన బాలసముద్రంలోని వెహికిల్ షెడ్డును మంగళవారం మేయర్ ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఈసందర్భంగా మరమ్మతులకు గురైన వాహనాలు, వాటి స్థితిగతులు, ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.