
పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
వనపర్తి రూరల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని.. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నేడు పండుగ వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు మండలంలో రూ.13 కోట్లు, శ్రీరంగాపురం మండలంలో రూ.21.75 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి, తోమాలపల్లి, కొత్తసూగూరు, ఈర్లదిన్నె, శేరుపల్లిలో గ్రామపంచాయతీ భవనాలు, రంగాపురంలో హమాలి సంఘం భవనం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, వైశాఖాపూర్లో మహిళా సంఘం భవనం, చెలిమిళ్లలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, బునాదిపురం గ్రామ పాఠశాలలో ల్యాబ్, కంచిరావుపల్లిలో హైమాక్స్ లైట్ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అలాగే వైశాఖాపూర్, యాపర్ల, తోమాలపల్లిలో అంగన్వాడీ భవనాలు, పెబ్బేరు మున్సిపాలిటీలో రూ.10.76 కోట్లతో చేపట్టే అమృత్ స్కీం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం యాపర్లలో బండలాగుడు పోటీలు ప్రారంభించి, అయ్యవారిపల్లి, యాపర్ల బడిబాటలో పాల్గొని పాఠశాలలో సరస్వతి పూజ చేసి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. అలాగే ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డులు, సన్నబియ్యం పంపిణీ లాంటి అనేక పథకాలు అమలవుతుండటంతో పేదలు ఎంతో ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, మార్కెట్ చైర్మన్లు ప్రమోదిని, శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్గౌడ్, నాయకులు సురేందర్గౌడ్, వెంకటేష్సాగర్, రంజిత్కుమార్, సూగూరు శివ, రామచంద్రారెడ్డి, దయాకర్రెడ్డి, రామన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.