భూముల క్రయవిక్రయాలు జరగక రైతు కుటుంబాల్లోని పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నా యి. 1965లో సెటిల్మెంట్ కోర్టులో తమకు అనుకూలంగా తీర్పువచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. రీసర్వేలో సమస్య సరిష్కారం అవుతుందని ఆశపడ్డాం. ఇంతలోనే ప్రభుత్వం మారడంతో సర్వేలో జాప్యం జరుగుతోంది.
– కిలపర్తి అప్పలపరిదేశినాయుడు, ఎంపీటీసీ, పెదరావుపల్లి గ్రామం
అన్యాయాన్ని గుర్తించాం..
పెదరావుపల్లి గ్రామం భూములకు సంబంధించి రైతులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించాం. సుమారు 8 ఎకరాల్లో గ్రామ కంఠంతో పాటు 184 ఎకరాల సాగు భూమి ఉన్నట్లు నిర్ధారించాం. ఈ భూములు ప్రస్తుతం విశాఖ జిల్లా పద్మనాభం మండలం, కొవ్వాడ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్–1లో కొండపోరంబోకు భూములుగా నమోదయ్యాయి. మరో మారు విచారణ చేసి గ్రామస్తులకు న్యాయం చేస్తాం.
– ఎస్.రామలక్ష్మి, తహసీల్దార్, కొత్తవలస మండలం


