ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి కచ్చితంగా గుర్తింపు పొంది ఉండాలి. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలో పిల్లలను చేర్చకూడదు. ఒక వేళ చేర్చితే భవిష్యత్లో ఇబ్బందులు తెలెత్తుతాయి. చైల్డ్ ఇన్ఫో ఆధారంగా విద్యార్థులు ప్రగతి పత్రాలు, టీసీలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేని వాటిలో ఈ నమోదు ఉండదు. ఆయా విద్యార్థులను బడిబయట ఉన్నవారిగా పరిగణించాల్సి వస్తుంది. అడ్మిషన్ విషయంలో జాగ్రత్తలు అవసరం. – యు.మాణిక్యంనాయుడు, డీఈఓ, విజయనగరం


