మత్స్య సంపద నాణ్యత, మార్కెటింగ్‌ మెరుగుదలపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

మత్స్య సంపద నాణ్యత, మార్కెటింగ్‌ మెరుగుదలపై దృష్టి

Oct 10 2025 7:58 AM | Updated on Oct 10 2025 7:58 AM

మత్స్య సంపద నాణ్యత, మార్కెటింగ్‌ మెరుగుదలపై దృష్టి

మత్స్య సంపద నాణ్యత, మార్కెటింగ్‌ మెరుగుదలపై దృష్టి

మహారాణిపేట: సంప్రదాయ మత్స్యకారుల అవసరాలు, సుస్థిర వేట విధానాలపై అవగాహన పెంచే లక్ష్యంతో సెంట్రల్‌ మైరెన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సంప్రదింపుల వర్క్‌షాప్‌ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిర ప్రసాద్‌ హాజరై ప్రసంగించారు. మత్స్య సంపద నాణ్యత, మార్కెటింగ్‌ మెరుగుదలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా సముద్ర సంపద పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న మత్స్యకారులను కలెక్టర్‌ ‘నీలి యోధులు’గా అభివర్ణించి, వారిని ఘ నంగా సన్మా నించారు. మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పి. లక్ష్మణ రావు, ప్రధాన శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు డాక్టర్‌ కిజకుడన్‌, డాక్టర్‌ మధుసూదన రావు, డాక్టర్‌ మీనా, ఎంపీడా డీడీ మహంతి సహా ఇతర సీఎమ్‌ఎఫ్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement