తాండూరు: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో పనులు ముందుకు సాగకపోవడంపై అసహనం వ్యక్తం చే శారు. కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. నిబంధనల మేరకు పనులు చేయని వారిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి


