అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జీఎస్టీ సంస్కరణలు, ఎంఎస్ఎంఈలు, వ్యవస్థాపకతపై ప్రభావం అనే అంశంపై రెండు రోజులపాటు జాతీయ స్థాయి సెమినార్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రొ. బాలకృష్టారెడ్డి జీఎస్టీ భాఽరత ఆర్థిక వ్యవస్థలో, విద్యారంగంలో కలిగిస్తున్న మార్పులపై విశ్లేషణాత్మకంగా వివరించారు. పరిశోధన, ఆవిష్కరణల ప్రాధాన్యతను వివరించి.. విధాన రూపకల్పనలో విద్యావేత్తల పాత్రను గుర్తు చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. గీతాలక్ష్మి పట్నాయక్, మల్లయ్య, సోమన్న, రాధిక తదితరులు పాల్గొన్నారు.


