
నిర్మాణ రంగంలో ‘భారతి సిమెంట్’ రారాజు
అనంతగిరి: నిర్మాణ రంగంలో రారాజు భారతి సిమెంట్ అని ఆ సంస్థ టెక్నికల్ ఇంజినీర్ సామ్రాట్ అన్నారు. వికారాబాద్లోని ఓం సాయి ట్రేడర్స్ డీలర్ దుకాణంలో బుధవారం తాపీ మేస్రీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణానికి సరైన ఎంపిక అని పేర్కొన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచితసాంకేతిక సహాయం అందజేస్తామని, స్లాబ్కాంక్రిట్ సమయంలో నిపుణులైన సంస్థ ఇంజినీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడతారని చెప్పారు. ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్కు రూ.20 అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూ.1 లక్ష ప్రమాద బీమా బాండ్లను 60 మంది తాపీ మేసీ్త్రలకు అందజేశారు. అనంతరం డీలర్ కృష్ణ మాట్లాడుతూ.. భారతి సిమెంట్ పనితీరు చాలా ఫాస్ట్గా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వీరాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.