అక్రమ తవ్వకాలను ఆపేయండి | - | Sakshi
Sakshi News home page

అక్రమ తవ్వకాలను ఆపేయండి

Sep 24 2025 8:20 AM | Updated on Sep 24 2025 8:20 AM

అక్రమ తవ్వకాలను ఆపేయండి

అక్రమ తవ్వకాలను ఆపేయండి

ప్రజాసంఘాల డిమాండ్‌

తహసీల్దార్‌ పద్మావతికి వినతిపత్రం

బొంరాస్‌పేట: కొత్తూరు శివారులోని మాలగుట్ట నుంచి మట్టి తవ్వకాలను నిలిపేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టను తవ్వుతూ పరిగితో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్‌, పోలీసులు కుమ్మకై ్క ఈ వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ తవ్వకాలను వెంటనే ఆపేయాలని తహసీల్దార్‌ పద్మావతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కె.చంద్రయ్య , సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్య, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు సుభాన్‌, కేఎన్‌పీఎస్‌ జిల్లా నాయకులు లక్ష్మయ్య, కుర్వ హక్కుల పోరాట సమితి నాయకుడు బాలప్ప, బాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మహేందర్‌, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement