ఈఏపీసెట్‌ ర్యాంకర్లకు మిట్స్‌ సువర్ణ అవకాశం | - | Sakshi
Sakshi News home page

ఈఏపీసెట్‌ ర్యాంకర్లకు మిట్స్‌ సువర్ణ అవకాశం

Jul 4 2026 12:38 AM | Updated on Jul 4 2026 12:38 AM

● టాప్‌ ర్యాంకర్లకు ఫీజు రాయితీ ● మిట్స్‌ ఛాన్స్‌లర్‌ నాదేళ్ల విజయభాస్కర్‌ చౌదరి వెల్లడి

కురబలకోట : ఈఏపీసెట్‌ ర్యాంకర్లకు అంగళ్లులోని మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలో ప్రత్యేక ఫీజు రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు ఛాన్సలర్‌ డాక్టర్‌ నాదేళ్ల విజయభాస్కర్‌ చౌదరి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరానికి బీటెక్‌లో అడ్మిషన్లు కొనసాగుతున్నాయన్నారు. ఈఏపీసెట్‌ ర్యాంకర్లకు అనుగుణంగా వారి ప్రతిభ అధారంగా తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అభ్యసించే సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అరుదైన సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సివిల్‌ ఇంజినీరింగ్‌, సీఎస్‌ఈ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, రోబోటిక్స్‌, ఈసీఈ, సీఎస్‌ఈ, బయోఇన్ఫాటిక్స్‌ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రోఛాన్సలర్‌ నాదేళ్ల ద్వారకనాఽథ్‌, వీసీ యువరాజ్‌, రిజిస్ట్రార్‌ డి. ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement