వైఎస్సార్‌సీపీ హయాంలో వైద్య రంగానికి మహర్ధశ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ హయాంలో వైద్య రంగానికి మహర్ధశ

Jun 14 2025 10:22 AM | Updated on Jun 14 2025 10:22 AM

వైఎస్సార్‌సీపీ హయాంలో వైద్య రంగానికి మహర్ధశ

వైఎస్సార్‌సీపీ హయాంలో వైద్య రంగానికి మహర్ధశ

గత వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేశారు. వైద్యరంగ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పులు తీసుకొచ్చారు. వైద్యులు, సిబ్బంది, వైద్య సదుపాయాలను సమకూర్చడంలో రాజీలేని నిర్ణయాలను అమలు చేశారు. ఉన్నత కుటుంబాలకే పరిమితమైన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పేదలకు వర్తింపజేశారు. అలానే ఆరోగ్య సురక్ష పేరుతో ఇంటి వద్దకే వైద్య సేవలను అందించిన ప్రభుత్వంగా దేశంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలన చరిత్ర కెక్కింది. హెల్త్‌ సెంటర్లలో ఆధునిక వైద్య పరికరాలు, 200కు పైగా మందులు, ల్యాబ్‌లను సమకూర్చారు. అలానే 108 సేవలను బలోపేతం చేసి విస్తరించారు. వేతనాలను డిమాండ్‌ మేరకు నాడు పెంచి ప్రోత్సహించారు. వాహనాలు మరమ్మతులకు గురైన వెంటనే రిపేర్లు చేయించి పటిష్టమైన వ్యవస్థను అమలు చేశారు. ఇదే స్థాయిలో 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను మరింత మెరుగ్గా అమలు చేసి ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ సేవలను అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement