
ఏపీఆర్జేసీ, పాలిసెట్లో ‘విశ్వం’ జయకేతనం
తిరుపతి ఎడ్యుకేషన్ : ఏపీఆర్జేసీ, పాలిసెట్ ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారని సంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి తెలిపారు. ఏపీఆర్జేసీలో వై.దేదీప్య రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, కె.మునిరూపేష్ 7వ ర్యాంకు, జె.అంజలి 9వ ర్యాంకు, మనీషా 10వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. అలాగే రేవంత్, అబ్దుల్ ఖాదర్, యోగి, సమత, భవ్యశ్రీ గీతిక, రోషన్, ట్వింకిల్, సంతోష్, భువన, కార్తికేయ తదితరులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. పాలిసెట్ ఫలితాల్లో ఎం.కావ్య 120మార్కులకు 117మార్కులు సాధించి బాలికల విభాగంలో జిల్లా స్థాయి ఉత్తమ ర్యాంకును సాధించినట్లు తెలిపారు. కిమ్యశ్రీ 116, కె.నిత్యశ్రీ 114, అబ్దుల్ ఖాదర్ 113, సుజినిరెడ్డి, చాతుర్య, రాజకుమారీ 112, ఎన్.రోషన్ 111, చేతన్రెడ్డి 110, జస్మిత 109మార్కులతో జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు వివరించారు. రాణించిన విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్రెడ్డి, కరస్పాండెంట్ తులసీ విశ్వనాథరెడ్డి అభినందించారు.