కనులపండువగా శ్రీవారి చక్రస్నానం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా శ్రీవారి చక్రస్నానం

May 14 2025 12:29 AM | Updated on May 14 2025 12:29 AM

కనులపండువగా శ్రీవారి చక్రస్నానం

కనులపండువగా శ్రీవారి చక్రస్నానం

ముగిసిన పెంచలకోన బ్రహ్మోత్సవాలు

రాపూరు:పెంచలకోనలో బ్రహ్మోత్సవాల్లో చివరి రోజై న మంగళవారం ఉదయం శ్రీవారి చక్రస్నానం కను లపండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులు, సుదర్శన చక్రం విగ్రహాలను పల్లకిలో కొలువుదీర్చి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య పుష్కరిణిలో స్వామివారి చక్రతల్వార్‌ (సుదర్శన చక్రం)ను పుష్కరిణిలో చక్రస్నానం చేయించారు.

వైభవంగా వసంతోత్సవాలు

పెంచలకోనలో స్వామి వారికి వసంతోత్సవాలు నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లకు వసంతాలు చల్లి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తెప్పపై నరసింహుని విహారం

శోభాయమానంగా అలంకరించిన తెప్పపై పెనుశిల నరసింహస్వామి ఉభయనాంచారులతో కలసి కొలువుతీరి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శమిచ్చారు. పెంచలకోనలోని నరసింహస్వామి వారి ఆలయంలో ఆరు రోజులుగా జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి తెప్పోత్సవం నిర్వహించారు. రాత్రి 10 గంటలకు స్వామి వారిని అశ్వవాహనంపై ఉంచి కోన మాడ వీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. రాత్రి 11 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement