ఉపాధిలో | - | Sakshi
Sakshi News home page

ఉపాధిలో

Apr 30 2025 12:26 AM | Updated on Apr 30 2025 12:26 AM

ఉపాధి

ఉపాధిలో

ఘనంగా నృత్య దినోత్సవం
తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో మంగళవారం ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం నిర్వహించారు.
గజ బీభత్సం
పాకాల మండలంబ గానుగపెంట పంచాయతీలో సోమవారం రాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.
● కూలీలు.. రైతులను పార్టీల వారీగా విభజించి పనులు ● ఇష్టారాజ్యంగా బినామీ పేర్లతో మస్టర్లు ● ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల నుంచి మేట్ల వరకు అందరూ టీడీపీ కార్యకర్తలే ● దొంగ హాజరుతో యథేచ్ఛగా నిధులు స్వాహా ● పాత పనులనే చూపించి దోపిడీ

బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

8లో

జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి టీడీపీ నేతలు తూట్లు పొడుస్తున్నారు. నిరుపేదల కడుపునింపే లక్ష్యానికి గండికొడుతున్నారు. అధికారుతో కుమ్మకై ్క ఇష్టారాజ్యంగా నిధులు స్వాహా చేస్తున్నారు. చివరకు కూలీలు.. రైతులపై పార్టీల ముద్ర వేసి పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఉపాధి సిబ్బందిగా పచ్చమూకను నియమించుకుని యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. బినామీ పేర్లతో మస్టర్లు వేయించి ప్రజాధనం కొల్లగొడుతున్నారు. తక్కువ మందితో పనులు చేయించి.. ఎక్కవ మంది వచ్చినట్లు రాసుకుని సొమ్ముచేసుకుంటున్నారు. సామాజికి తనిఖీల్లో తెలుగు తమ్ముళ్ల అవినీతి బట్టబయలైనప్పటికీ ఉన్నతాధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.

చేసిందే చేస్తూ..!

వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం కుల్లూరు పంచాయితీలో పంట కాలువ పూడిక తీతకు సంబంధించి వర్క్‌ ఐడీ : 191850102 15075 కింద ఏడుగురు మాత్రమే పనులు చేశారు. వీరికి మస్టర్‌ నంబర్‌ 543 నమోదు చేశారు. అయితే ఇదే ఫోటో పెట్టి 20 మంది పనులు చేసినట్లు 544, 545 నంబర్లతో మస్టర్లు నమోదు చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా కష్టపడి పనిచేసే కూలీలకు అంతంత మాత్రంగా కూలి డబ్బులు వస్తుంటే, బినామీ కూలీలకు మాత్రం అధిక మొత్తంలో నగదు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దాచూరు గ్రామంలో ట్యాంకు నిర్మాణానికి రెండు వర్క్‌ ఐడీలు : 9999005189091, 999900518 9093 కింద పనులు చేశారు. 10 మస్టర్‌లకు గానూ 37 మంది పనికి వచ్చినట్టు బినామీ మస్టర్లు వేశారు. నిజానికి అక్కడ పనికి వచ్చింది 12 మంది మాత్రమే అని పలువురు కూలీలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఐడీ నంబర్‌ 1710385 సృష్టించి ఫీడర్‌ కాలువ పని చేసినట్టు పాత ఫొటోలు అప్‌లోడ్‌ చేసి నగదు స్వాహా చేసేశారని వివరిస్తున్నారు. మేట్‌లుగా అవతారం ఎత్తిన తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా అందిన కాడికి దోచుకుంటున్నారని మండిపడుతున్నారు.

ఉపాధి పనులు చేస్తున్న దృశ్యం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : ఫీల్డ్‌ అసిస్టెంట్లు.. మేట్లు.. సీనియర్‌ మేట్లు.. అందరూ టీడీపీ కార్యకర్తలే. సాంకేతిక సహాయకులు, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లు, ఏపీఓలు అధికార పార్టీ అనుకూలురే. దీంతో ఉపాధి హామీ పనుల్లో దోపిడీ యథేచ్చగా సాగుతోంది. పచ్చ నేతలు, ఉపాధి సిబ్బంది ఏకమై నిధులను స్వాహా చేసేస్తున్నారు. రారష్ట్‌రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతలు దృష్టి ఉపాధి పథకంపై పడింది. వెంటనే పలు ప్రాంతాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లను నిష్కారణంగా తప్పించి తమ వారిని నియమించుకున్నారు. మొత్తం 1,800 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లలో దాదాపు 85శాతం మందిని తప్పించినట్లు సమాచారం. మిగిలిన వారు మాట వినకుంటే టీడీపీ నేతలు దాడులకు తెగపడుతుండడం గమనార్హం.

తమ్ముళ్లకే ప్రాధాన్యం

రాజకీయాలకు సంబంధం లేకుండా పేదలందరికీ ఉపాధి పనులు కల్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లకే పనులు కేటాయిస్తున్నారు. బోగస్‌ హాజరుతో మస్టర్లను నింపేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారు. టీడీపీ మద్దతుదారులైతే గరిష్టం వేతనం రూ.300 , వైఎస్సార్‌సీపీ వర్గీయులకు అతి తక్కువ వేతనం ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముడుపులు ఇస్తేనే జాబ్‌ కార్డులు

అడిగిన వారందరికీ జాబ్‌కార్డులు ఇచ్చి పనులు కల్పించాలి. ఎలాంటి రుసుం లేకుండా జాబ్‌కార్డులు జారీ చేయాలి.అయితే ఒక్కో జాబ్‌కార్డుకు రూ.1500 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు.

యంత్రాలతోనే..

జిల్లాల్లో సుమారు 10వేలకు పైగానే ఫామ్‌పాండ్స్‌ నిర్మించాలనేది లక్ష్యం. ఇప్పటికే వీటికి సంబంధించి పనులు సాగుతున్నాయి. వాటిని కూలీలతో చేయించకుండా యంత్రాలతో కానిచ్చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేసీబీతో అంతా పూర్తి చేసిన తర్వాత ఒకటి, రెండు రోజులు కూలీలతో తూతూమంత్రంగా పనులు చేయించి బిల్లులు కొల్లగొడుతున్నారు. ఒక్కో ఫామ్‌ఫాండ్‌కు సైజ్‌ను బట్టి రూ. 50వేలు నుంచి రూ.లక్ష వరకు స్వాహా చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వారిపై వైఎస్సార్‌సీపీ ముద్ర వేసి పనులకు రానివ్వకుండా తరిమేస్తున్నట్లు తెలిసింది.

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

ప్రభుత్వ సొమ్ము పక్కదారి!

ఇటీవల కోట పంచాయతీలో ఉపాధి పనులపై సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. అందులో దాదాపు రూ.కోటికి పైగా ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టినట్లు వెల్లడైంది. అయితే పీడీ శ్రీనివాసప్రసాద్‌ నేతృత్వంలో చేపట్టిన ప్రజావేదికలో మాత్రం కేవలం రూ.4లక్షలే అవినీతి జరిగినట్లు అధికారులు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. ఓ మండలస్థాయి అధికారి ఆధ్వర్యంలోనే ఉపాధి నిధులు బొక్కేసారంటూ పలువురు నేరుగా పీడీకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.

ఉదాసీనంగా అధికారులు

రాపూరు మండలంలో సైతం ఉపాధి పనుల్లో టీడీపీ నేతలు, సిబ్బంది కుమ్మకై ్క నిధులు దోచుకుంటున్నారు. ఈ మేరకు సోషల్‌ ఆడిట్‌, ప్రజావేదికలో కూడా అవినీతి బహిర్గతమైనా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సైదాపురంలో నిర్వహించిన ప్రజావేదికలో రూ.50లక్షలకు పైగా ఉపాధి నిధులను కాజేసినట్లు తెలిసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కొలతల మేరకే కూలి

ఉపాధి పనుల్లో కొలతల ప్రకారం చేస్తేనే కూలి చెల్లిస్తాం. బినామీ పేర్లతో మస్టర్‌ వేసుంటే చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో మస్టర్‌ వెరిఫికేషన్‌ చేపడతాం. అవకతవకలుంటే ఎంపీడీఓ దృష్టికి తీసుకెళతాం. అవినీతిని సహించే ప్రసక్తే లేదు. – సునీల్‌, ఏపీఓ, కలువాయి

ఉపాధిలో1
1/4

ఉపాధిలో

ఉపాధిలో2
2/4

ఉపాధిలో

ఉపాధిలో3
3/4

ఉపాధిలో

ఉపాధిలో4
4/4

ఉపాధిలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement