సాక్షి, హైదరాబాద్: ఎంఎంసీ, సీఎంసీలో రూ.10 కోట్లకు పైబడిన ఈపీసీ పనుల కోసం కమిటీల పునర్వ్యవస్థీకరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు కొత్త కమిటీలను నియమించింది. టెక్నికల్ బిడ్ల పరిశీలనకు కమిటీ-2కి అధికారాలు ఇచ్చింది. టెండర్ల ఆమోద ప్రక్రియకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. రూ.10 కోట్లకు మించిన పనులపై పర్యవేక్షణ చేయనుంది.
పనుల స్కోప్, డెలివరబుల్స్, బెంచ్మార్క్ల పరిశీలనకు కమిటీ-1, ధర బిడ్ల ఓపెనింగ్, టెండర్ ఆమోదాలకు కమిటీ-2, అదనపు పనులు, గడువు పొడిగింపుల ఆమోదానికి కమిటీ-3 ఏర్పాటు చేసింది. ఇంజినీర్-ఇన్-చీఫ్ (పబ్లిక్ హెల్త్)కు కీలక బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండబ్ల్యూఎస్,ఎస్బీ, హెచ్ఎండీఏ, ఆర్థిక శాఖ ప్రతినిధులను కమిటీల్లో ప్రభుత్వం స్థానం కల్పించింది. ఎంఎంసీ, సీఎంసీ కమిషనర్లు తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.


