-
అసంతృప్తులకు కమిటీల కొలువులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యనేతలతోపాటు అసంతృప్త నేతలకు కీలక కమిటీల్లో చోటు కల్పిస్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 14 కమి టీలకు చైర్మన్లు, కన్వీనర్లు, కో–కన్వీనర్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి నియమించారు. అసంతృప్తవాదులకు బుజ్జగింపు... పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు దక్క డం లేదని, ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కార్ పై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయనాయకత్వం తగిన విధంగా వ్యవహరించడం లేదంటూ కొంతకాలంగా కొందరు జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్యనేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ తగిన విధంగా వ్యవహ రించకపోతే, బీఆర్ఎస్ను ఓడించగలిగే పార్టీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమేనంటూ కూడా వారిలో కొందరు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితు ల్లో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే దానిపై, ఇతర అంశాలపై చర్చకు జాతీయ కార్యవర్గ సభ్యు లు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వ ర్రెడ్డి, ఎం.రవీంద్ర నాయక్, జి.విజయరామా రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి తదిత రులు ఇటీవల కాలంలో పలుమార్లు భేటీ అయ్యా రు. వారిలో కొందరు త్వరలోనే బీజేపీని వీడతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ప్రధాని మోదీ మహబూబ్నగర్, నిజామాబాద్లలో నిర్వ హించిన బహిరంగ సభలకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతోపాటు కేసీఆర్ సర్కార్, బీఆర్ ఎస్ తీరును తీవ్రంగా ఎండగట్టడం వంటి పరిణా మాలతో వారి వైఖరిలో మార్పు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అలాగే పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా వివిధ కమిటీల్లో ప్రాధాన్యత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికలుండగా ఆందోళనల కమిటీకి చైర్మన్గా విజయశాంతిని నియ మించడం గమనార్హం. అదేవిధంగా వివిధ కమిటీ ల్లో వివేక్ వెంకట స్వామి, రాజ్గోపాల్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రవీంద్రనాయక్, విజయరామారా వులకు ప్రాతినిధ్యం కల్పించారు. వారితోపాటు ముఖ్యనేతలు కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి, మురళీశర్రావు, మర్రి శశిధర్రెడ్డి. పొంగులేటి సుధాకరరెడ్డిలకు కూడా అవకాశం కల్పించారు. కాగా, తనతోపాటు ఇతర ముఖ్య నేతలెవరూ బీజేపీని వీడట్లేదని రాజ గోపాల్రెడ్డి స్పష్టం చేశారు. కమిటీలు ఇలా... సోషల్ అవుట్రీచ్ కమిటీ: చైర్మన్గా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, కన్వీనర్గా మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పబ్లిక్ మీటింగ్ కమిటీ: చైర్మన్గా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, కన్వీనర్గా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, జాయింట్ కన్వీనర్గా డా. కాసం వెంకటేశ్వర్లు యాదవ్ ప్రజలను ప్రభావితం చేసే వారికి చేరువయ్యే కమిటీ: చైర్మన్గా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కన్వీనర్గా పొంగులేటి సుధాకర్రెడ్డి మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ: చైర్మన్గా జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్, కన్వీనర్గా మా జీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, జాయింట్ కన్వీనర్గా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. చార్జిషీట్ కమిటీ: చైర్మన్గా పార్టీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి పి.మురళీధర్రావు, కన్వీనర్గా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, జాయింట్ కన్వీనర్గా చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ రామచంద్రుడు స్క్రీనింగ్ కమిటీ: చైర్మన్గా జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, కన్వీనర్గా దుగ్యాల ప్రదీప్కుమార్ ఆందోళనల కమిటీ: చైర్మన్గా విజయశాంతి, కన్వీనర్గా డా.జి.మనోహర్రెడ్డి సోషల్ మీడియా కమిటీ: చైర్మన్గా ఎంపీ అర్వింద్, కన్వీనర్గా పోరెడ్డి కిషోర్రెడ్డి ఎన్నికల కమిషన్ అంశాల కమిటీ: చైర్మన్గా మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి, కన్వీనర్గా మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్కుమార్ ప్రధాన కార్యాలయ సమన్వయ కమిటీ: చైర్మన్గా జాతీయ కార్యవర్గసభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, కన్వీనర్గా బంగారు శ్రుతి మీడియా కమిటీ: చైర్మన్గా ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు, కన్వీనర్గా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్రావు, జాయింట్ కన్వీనర్గా డా.ఎస్. ప్రకాష్రెడ్డి క్యాంపెయిన్ ఇష్యూస్/టాకింగ్ పాయింట్స్ కమిటీ: చైర్మన్గా వెదిరె శ్రీరామ్, కన్వీనర్గా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎస్సీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ: చైర్మన్గా జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్రెడ్డి, కన్వీనర్గా మాజీ మంత్రి జి.విజయరామారావు ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ: చైర్మన్గా జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావు, కన్వీనర్గా ఎంపీ సోయం బాపూరావు, జాయింట్ కన్వీనర్గా ఎం. రవీంద్రనాయక్ నియమితులయ్యారు. -
సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఆరు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 16, 17 తేదీల్లో హైదరా బాద్ వేదికగా జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నిర్వహణ కోసం టీపీసీసీ ఆరు కమిటీలను ఏర్పాటు చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు 39 మంది ముఖ్య నేతలతో రిసెప్షన్ కమిటీని నియమించింది. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, సీడబ్ల్యూసీ ఆహ్వానితులు దామోదర రాజనర్సింహ, వంశీచందర్రెడ్డిలతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఈ కమిటీలో చోటు కల్పించింది. మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చైర్మన్గా ఏడుగురితో సోషల్ మీడియా కమిటీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్గౌడ్ చైర్మన్గా ఏడుగురితో ట్రాన్స్పోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఖమ్మం మాజీ ఎంపీ, టీపీపీసీ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీని వాస్రెడ్డి చైర్మన్గా, గాలి అనిల్కుమార్ కోచైర్మన్గా పబ్లిసిటీ అండ్ బ్రాండింగ్ కమిటీ, అజారుద్దీన్ చైర్మన్గా జీహెచ్ఎంసీ పబ్లిసిటీ కమిటీ, టీపీసీసీ ప్రొటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్ రావు చైర్మన్గా ప్రొటోకాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 29 మందిని సభ్యులుగా నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్కుమార్గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ చదవండి: గుడుంబా పోయి.. కేసీఆర్ బాటిల్ వచ్చింది: ఈటల -
శ్రీధర్బాబు ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీ
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేసింది. పార్టీ మేనిఫెస్టోను తయారు చేసే బాధ్యతను మాజీ మంత్రి శ్రీధర్బాబుకు అప్పగించింది. శ్రీధర్బాబు చైర్మన్గా మరో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్కుమార్ వైస్చైర్మన్గా 24 మంది సభ్యులతో తెలంగాణ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మేనిఫెస్టో కమిటీ సహా 107 మందితో మొత్తం 8 కమిటీలను ఏఐసీసీ నియమించింది. ఎన్నికల నిర్వహణ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు, పబ్లిసిటీ, చార్జిషీట్, కమ్యూనికేషన్స్, ట్రైనింగ్, స్ట్రాటజీ కమిటీలను ఏర్పాటు చేసింది. అన్ని వర్గాల నేతలకు ఈ కమిటీల్లో స్థానం కల్పించింది. మేనిఫెస్టో కమిటీతోపాటు చార్జిషీట్ కమిటీకి ఎక్స్అఫీషియో సభ్యులను కూడా నియమించింది. టీపీసీసీ కమిటీల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు శిక్షణ కమిటీ బాధ్యతను అప్పగించింది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ విడుదల చేసిన టీపీసీసీ కమిటీలు... 1. ఎన్నికల నిర్వహణ కమిటీ: దామోదర రాజనర్సింహ (చైర్మన్), వంశీచందర్రెడ్డి, ఈర్ల కొమురయ్య, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నమిండ్ల శ్రీనివాస్, జగన్లాల్ నాయక్, సుప్రభాత్రావు, భరత్చౌహాన్, ఫక్రుద్దీన్. 2. మేనిఫెస్టో కమిటీ: దుద్దిళ్ల శ్రీధర్బాబు (చైర్మన్), గడ్డం ప్రసాద్ (వైస్ చైర్మన్), దామోదర, పొన్నాల, బలరాం నాయక్, ఆర్. దామోదర్రెడ్డి, చిన్నారెడ్డి, సంభాని చంద్రశేఖర్, పోట్ల నాగేశ్వరరావు, ఎం. రమేశ్ముదిరాజ్, ఒబేదుల్లా కొత్వాల్, తాహెర్బీన్హందాన్, ఎర్ర శేఖర్, జి. నాగయ్య, గండ్రత్ సుజాత్, రవళిరెడ్డి, కత్తి వెంకటస్వామి, మర్రి ఆదిత్యరెడ్డి, ప్రొఫెసర్ జానయ్య, దీపక్జాన్, మేడిపల్లి సత్యం, చందా లింగయ్య, మువ్వా విజయ్బాబు, చామల శ్రీనివాస్. (ఈ కమిటీకి ఎక్స్అఫీషియో సభ్యులుగా పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, అనుబంధ సంఘాల చైర్మన్లను నియమించారు.) 3. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ: బలరాం నాయక్ (చైర్మన్), ఎన్. పద్మావతిరెడ్డి, నేరెళ్ల శారద, రాపోలు జయప్రకాశ్, వేంరెడ్డి శ్రీనివాస్రెడ్డి, లక్ష్మణ్యాదవ్, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, కె. కృష్ణారెడ్డి, కె. తిరుపతి, సయ్యద్ నిజాముద్దీన్. 4. పబ్లిసిటీ కమిటీ: షబ్బీర్ అలీ (చైర్మన్), ఈరవత్రి అనిల్ (వైస్చైర్మన్), గడ్డం వినోద్, సురేశ్ షేట్కార్, గాలి అనిల్కుమార్, కుమార్రావు, సంగిశెట్టి జగదీశ్వర్రావు, గడుగు గంగాధర్, మన్నె సతీశ్, నాయుడు సత్యనారాయణ గౌడ్, వచన్కుమార్, మధుసూదన్గుప్తా. 5. చార్జిషీట్ కమిటీ: సంపత్కుమార్ (చైర్మన్), రాములు నాయక్ (వైస్ చైర్మన్), సిరిసిల్ల రాజయ్య, కోదండరెడ్డి, గంగారాం, బెల్లయ్య నాయక్, జ్యోత్స్న రెడ్డి, ఉజ్మా షాకీర్, నాగరిగారి ప్రీతం, నూతి శ్రీకాంత్ గౌడ్, షేక్ సోహైల్, మెట్టు సాయికుమార్, అన్వేశ్రెడ్డి, సిరాజ్ అమీన్ ఖాన్. ( ఈ కమిటీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా పార్టీ అధికార ప్రతినిధులను నియమించారు.) 6. కమ్యూనికేషన్స్ కమిటీ: జెట్టి కుసుమకుమార్ (చైర్మన్), మదన్మోహన్రావు (వైస్చైర్మన్), ఎం.ఎ.ఫహీమ్, అనిరుద్రెడ్డి, ఫిరోజ్ఖాన్, జైపాల్ వడ్డెర, అవెజొద్దీన్, గాలి బాలాజీ, కొప్పుల ప్రవీణ్. 7. ట్రైనింగ్ కమిటీ: పొన్నం ప్రభాకర్ (చైర్మన్), పవన్ మల్లాది (కన్వినర్), గోపిశెట్టి నిరంజన్, సయ్యద్ అజ్మతుల్లా, కోట నీలిమ, పూజల హరికృష్ణ, డాక్టర్. రవిబాబు, ఎం. లింగాజి, కోల్కొండ సంతోశ్, శ్రవణ్రావు, ఊట్ల వరప్రసాద్, వెంకటరమణ, మమతానాగిరెడ్డి, సాగరికారావు, రిషికేశ్రెడ్డి, కొత్త సీతారాములు, ఎం.ఎ.బాసిత్. 8. స్ట్రాటజీ కమిటీ: కొక్కిరాల ప్రేమ్సాగర్రావు (చైర్మన్), కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, జంగయ్య యాదవ్, సింగాపురం ఇందిర, నరేశ్ జాదవ్, పాల్వాయి స్రవంతి, కోటింరెడ్డి వినయ్రెడ్డి, ఈర్లపల్లి శంకర్, ఆడం సంతోశ్, ఆమీర్జావెద్, జి.వి.రామకృష్ణ, లోకేశ్ యాదవ్, రాములు యాదవ్. -
ఎంపీల చేతికి ‘పవర్’!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ కోసం స్థానిక ఎంపీ నేతృత్వంలో జిల్లా స్థాయి విద్యుత్ కమిటీలను ఏర్పాటు చేయా లని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో అత్యంత సీనియర్ ఎంపీ చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో కో–చైర్మన్లుగా జిల్లా లోని ఇతర ఎంపీలు, సభ్యకార్యదర్శులుగా జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, సభ్యులుగా జడ్పీచైర్మన్, ఎమ్మెల్యేలను నియమించాలని సూచించింది. కనీసం 3 నెలలకోసారి ఈ కమిటీ సమావేశాన్ని నిర్వహించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు కేంద్రం అప్పగించింది. విద్యుత్ రంగంలో కేంద్ర సంస్కరణలు, పథకాల అమలు తీరుపై ఈ కమిటీ సమీక్ష జరుపుతుంది. ఈ కమిటీ ఏర్పాటుతో జిల్లా స్థాయిలో సీనియర్ ఎంపీలు ‘పవర్ ఫుల్’గా మారనున్నారు. కేంద్ర పథకాల అమలు, శాఖ పనితీరు, రైతులు, వినియోగదారుల సమస్యలు వంటి అంశాలపై జిల్లా విద్యుత్ అధికారులు ఈ కమిటీకి నిత్యం సమాధానం ఇచ్చుకునే పరిస్థితి రానుంది. కొత్త సంస్కరణల అమలుకే.. దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం ఇటీవల కేంద్రం రూ.3 లక్షల కోట్లతో కొత్త పథకాన్ని ప్రకటించింది. జిల్లా స్థాయిలో ఈ పథకం అమలుపై నిరంతర పర్యవేక్షణకు సీనియర్ ఎంపీల నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద నిర్ధేశించిన సంస్కరణలను అమలు చేస్తేనే డిస్కంలకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందనుంది. ప్రధానంగా నష్టాలను తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలతో డిస్కంలు ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కేంద్రం నుంచి ఈ పథకం కింద నిధులు రానున్నాయి. దేశ వ్యాప్తంగా 25 కోట్ల స్మార్ట్ మీటర్లను బిగించడానికి కేంద్రం ఈ పథకం కింద తన వాటాగా రూ.22,500 కోట్లు కేటాయించింది. ఇతర సంస్కరణల అమలుకు రానున్న ఐదేళ్లలో కేంద్ర వాటాగా రూ.97,631 కోట్లను డిస్కంలకు అందజేయనుంది. ఈ పథకంతో పాటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన, ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం, కుసుమ్ వంటి కేంద్ర పథకాల అమలును ఈ కమిటీ పర్యవేక్షించనుంది. -
బూత్ కమిటీలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ప్రచార గడువు ముగింపుకొస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు బూత్కమిటీలపై దృష్టి పెట్టాయి. పోలింగ్కు ముందు రెండ్రోజులు, పోలింగ్ రోజున వీరి పాత్ర క్రియాశీలకం కానున్న నేపథ్యంలో బూతు కమిటీలకు కావాల్సిన సరంజామా సర్దే పనిలో పడ్డాయి. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీలతో పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఈవీఎంలలో అభ్యర్థుల నంబరింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో డమ్మీ ఈవీఎంలతో వారికి అవగాహన కల్పిస్తున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్న ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకుండా, ప్రతి ఇంటికీ ఓటరు స్లిప్పులు పంచడం, వారి నుంచి ఓటు హామీ పొందడం, తటస్థులను మచ్చిక చేసుకోవడం లక్ష్యంగా బూత్ కమిటీలను పార్టీలు సిద్ధం చేస్తున్నాయి. ఓటింగ్ శాతం పెంచడం, వృద్ధ, దివ్యాంగ ఓటర్లను బూత్లకు తీసుకొచ్చేందుకు పార్టీలన్నీ బూత్ కమిటీలపై ఆధారపడుతున్నాయి. ఇన్చార్జీలకు ప్రత్యేక శిక్షణ పోలింగ్ రోజు, అంతకు ముందు రోజు ఓటర్లతో నేరుగా మాట్లాడేందుకు వీరే కీలకం కావడంతో బూత్ కమిటీల ఇన్చార్జీలకు పార్టీలు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. పార్టీ ప్రచారాస్త్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కరపత్రాలు పంచడం, నేతల మధ్య సమన్వయం చేసే బాధ్యతలన్నీ కమిటీలకే అప్పగించాయి. పార్టీల అసెంబ్లీ ఇన్చార్జీల సూచనల మేరకు బూత్కమిటీలను ఎంపిక చేసి, పార్టీకి ఓట్ల శాతం పెంచే యత్నాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రధాన పార్టీలన్నీ పోలింగ్ బూత్ల వారీగా పార్టీ కమిటీలు నియమించాయి. ఒక్కో బూత్ పరిధిలో 10 మంది ముఖ్య పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించడంతో పాటు ఓటర్లతో సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement