Telangana CM: ప్రగతిభవన్ నిర్మాణ ఖర్చెంతో తెలుసా?

సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధికార నివాసం ‘ప్రగతిభవన్’ నిర్మాణానికి రూ.45.91 కోట్లు వ్యయమైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. 2016 మార్చిలో ప్రగతిభవన్ నిర్మాణాన్ని ప్రారంభించి అదే ఏడాది నవంబర్లో పూర్తి చేసినట్టు రోడ్లు, భవనాల శాఖ తెలిపింది. ప్రగతిభవన్ నిర్మాణ వ్యయం వివరాలు తెలపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. ఆర్ అండ్ బీ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.