ఈడీ కేసీఆర్‌ ప్రస్తావన తేలేదు: కవిత లాయర్‌ | Kavitha lawyer Clarified On Kcr Name In Delhi Court | Sakshi
Sakshi News home page

ఈడీ కేసీఆర్‌ ప్రస్తావన తేలేదు: కవిత లాయర్‌

May 28 2024 9:55 PM | Updated on May 29 2024 8:09 AM

Kavitha lawyer Clarified On Kcr Name In Delhi Court

సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రస్తావన తేలేదని కవిత తరపు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.

ఈడీ రిపోర్టులో ఎక్కడ కూడా కేసీఆర్‌ పేరు రాయలేదన్నారు. బెయిల్‌ పిటిషన్‌ వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని మాత్రమే ప్రస్తావించిందని తెలిపారు.

రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులరెడ్డికి లిక్కర్‌ కేసులో ఉన్నవారిని పరిచయం చేశానని చెప్పినట్లు ఈడీ తెలిపిందన్నారు. కవిత బెయిల్‌ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement