జనగామ: మద్యం మత్తులో ఒక వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. పూటుగా తాగిన వెంకన్న అనే ఓ వ్యక్తి జనగామ బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సుతో ఊడాయించాడు. ఈ క్రమంలో బస్సుతో వేగంగా వెళుతూ 21 కిలోమీటర్ల తర్వాత సింగరాజు పల్లి టోల్ గేట్ వద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. దీంతో టోల్ గేట్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం బస్సు యజమాని ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సుతో పాటు జనగామ పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. మద్యం మత్తు, మానసిక పరిస్థితి కారణంగానే ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.


