
రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదుతోనే..
గచ్చిబౌలి: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఏప్రిల్ 26న జరిగిన తమిళ హీరో సూర్య చిత్రం రెట్రో ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ పహల్గామ్ ఉగ్ర దాడి అంశాన్ని ప్రస్తావించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘కశ్మీర్ మనదే.. కశ్మీర్ ప్రజలు మనవాళ్లే.. 500 ఏళ్ల క్రితం ట్రైబల్ యుద్ధం చేసిన రీతిలో పాకిస్తాన్ భారత్పై యుద్ధం చేస్తోంది.
కానీ పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. తిండి, నీళ్లు లేక వాళ్ల ప్రజలే పాకిస్తాన్పై యుద్ధం చేస్తారు’అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. అయితే ‘500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ చేసినట్లుగా’అనే వ్యాఖ్యలు తమ మనోభావాలు గాయపరిచాయంటూ ట్రైబల్ కమ్యూనిటీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్కుమార్ నాయక్ అలియాస్ అశోక్ రాథోడ్ ఈ నెల 17న రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేయగా, న్యాయ సలహా తీసుకున్న పోలీసులు.. విజయ్ దేవరకొండపై శనివారం అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.