క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Nov 1 2025 7:46 AM | Updated on Nov 1 2025 7:46 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

స్వదేశీ మిట్రల్‌ క్లిప్‌తో పురోగతి

సాక్షి, చైన్నె : స్వదేశీ మిట్రల్‌ క్లిప్‌(మైక్లిప్‌)తో పురోగతి సాధించామని రేడియల్‌ రోడ్డులోని కావేరి ఆస్పత్రి చీఫ్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ అజిత్‌ పిళ్లై తెలిపారు. మైక్లిప్‌ను ఉపయోగించి తమిళనాడులో తాము 58 ఏళ్ల రోగికి నిర్వహించిన శస్త్ర చికిత్స గురించి శుక్రవారం మీడియాకు వివరించారు. ఈ క్లిప్‌తో హార్ట్‌ వాల్వ్‌ రిపేర్‌తో చారిత్రాత్మక మైలురాయిని సాధించామన్నారు. 58 ఏళ్ల మహిళ తీవ్రమైన గుండె జబ్బుతో బాధ పడుతూ రాగా, మేక్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తితో ఆమెకు మిట్రల్‌ క్లిప్‌ పరిక రం–మైక్లిప్‌ను ఉపయోగించి శస్త్రచికిత్సను విజయవంతం చేశామన్నారు. అధునాతన గుండె సంరక్షణను ఈ విధానం అందుబాటులోకి తెచ్చిందన్నారు.

వినూత్న నిరసన

సాక్షి, చైన్నె : తాంబరం కార్పొరేషన్‌ సిబ్బంది శుక్రవారం వినూత్న నిరసనకు దిగారు. తాంబరం కార్పొరేషన్‌ పాలక మండలి సమావేశం శుక్రవారం జరిగింది. ఇందులో అన్నాడీఎంకే సభ్యులు వినూత్నంగా కుక్క, ఆవు బొమ్మలతో కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. ఇందుకు కారణం రోడ్లపై ఆవులు, కుక్కలు స్వైర విహారం చేస్తుండడంతో వాహనచోదకు లు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇలా వివరించారు.

చైన్నె బీచ్‌ల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు

కొరుక్కుపేట: మోంథా తుపాన్‌ కారణంగా చైన్నెలో సముద్రం ఉప్పొంగింది. దీనికితోడు రెండు రోజులుగా నిరంతర వర్షాల కురవడంతో, అడయార్‌ నది నీటి మట్టం పెరిగింది. దీంతో చైన్నె తీరప్రాంతాల్లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోయాయి. చైన్నె లోని పట్టినం పాక్కం నుంచి మెరీనా వరకు తీరప్రాంతంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌లు, మద్యం సీసాలు, విరిగిన థర్మోకోల్‌ పేరుకుపోతున్నాయి. ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలు తీరప్రాంతంలో నివసించే ప్రజలకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తున్నాయి. పర్యావరణాన్ని నాశ నం చేస్తున్నాయి. చైన్నె తీరం వెంబడి పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అవి అలలపై తెలియాడుతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలోకి చేరకముందే తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నేడు సెయింట్‌ జార్జ్‌ కేథడ్రల్‌ చర్చి పునఃప్రారంభం

కొరుక్కుపేట: చైన్నె సెయింట్‌ జార్జ్‌ కేథడ్రల్‌ చర్చిని నవంబర్‌ ఒకటో తేదీన పునఃప్రారంభించనున్నారు. చైన్నెలోని జెమిని వంతెన సమీపంలో ఉన్న సెయింట్‌ జార్జ్‌ కేథడ్రల్‌ చర్చి, చైన్నెలోని పురాతన క్రైస్తవ చర్చిల్లో ఒకటి. దీనిని చైన్నె ఆర్చ్‌ డియోసెస్‌ ఆఫ్‌ ది చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (సీఎస్‌ఐ) నిర్వహిస్తోంది. 210 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చిలో క్రైస్తవ మిషనరీలు నిర్మించాలని నిర్ణయించి, చర్చి అసలు రూపం మార్చకుండా పునరుద్ధరించడానికి ప్రణాళిక రూపొందించారు. గత జనవరిలో పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పునరుద్ధరణ పనిలో ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్‌ అరుణమెన్న వంటి నిపుణులు పాల్గొన్నారు. ఆధునీకరించిన ఈ చర్చిని నవంబర్‌ 1న పున ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.

బూత్‌కు ఐదుగురు న్యాయవాదులు

–టీఆర్సీ యూనియన్‌ నిర్ణయం

కొరుక్కుపేట: చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి, టీఆర్సీ యూనియన్‌లోని 234 నియోజకవర్గాల్లో, బ్రాంచ్‌, ఏరియా వారీగా న్యాయవాదులను నియమించను న్నారు. 234 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్‌ బూత్‌లకు టీఆర్సీ తరఫున న్యాయవాదులను నియమిస్తారు. ఈ విషయంలో టీఆర్సీ న్యాయవాదుల బృందం సంప్రదింపుల సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు పనయూర్‌లోని టీఆర్సీ ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. తమిళనాడు అంతటా ఉన్న టీఆర్సీ న్యాయవాదుల బృందం సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. చైర్మన్‌ విజయ్‌ పట్టుబట్టడంతో, జనరల్‌ సెక్రటరీ ఎన్‌.ఆనంద్‌ నిర్వాహకులు సమావేశంలో పాల్గొని సలహాలు అందిస్తారు.

బస్టాండ్‌ నిర్మాణానికి

భూమి పూజ

కొరుక్కుపేట: అలందూర్‌ వద్ద రూ.1.50 కోట్లతో ఆధునిక బస్టాండ్‌ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను మంత్రి అన్బరసన్‌ ప్రారంభించారు. హైవే శాఖ తరఫున, అలందూర్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ ఎదురుగా, అలందూర్‌ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి రూ.కోటి 50 లక్షల అంచనా వ్యయంతో ఒక రహదారిని నిర్మించారు. ఈ ప్రాంతంలో ఆధునిక బస్టాండ్‌ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. అలందూర్‌ జోనల్‌ కమిటీ చైర్మన్‌ ఎన్‌.చంద్రన్‌ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. చైన్నె హైవేస్‌ డిపార్ట్‌మెంట్‌ మానిటరింగ్‌ ఇంజినీర్‌ శరవణన్‌ సెల్వం, డివిజనల్‌ ఇంజినీర్‌ తిరునావుక్కరసు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement