
టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
తిరువళ్లూరు: టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, నిబంధనలను అతిక్రమించి మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పుల్లరంబాక్కం గ్రామస్తులు రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన ఇళయరాజా కేబుల్ ఆపరేటర్. ఈక్రమంలో గురువారం ఉదయం పుల్లరంబాక్కం నుంచి పూండికి బైక్లో బయలుదేరాడు. మోవూరు వద్ద వెళుతుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇళయరాజాను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈక్రమంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు రాస్తారోకో నిర్వహించారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు నిబంధనలను అతిక్రమించి నిర్వహిస్తున్న క్వారీని వెంటనే మూసివేయాలని రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. దీంతో ట్రాపిక్కు తీవ్రఅంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి వెళ్లి చర్చలు జరిపిన పుల్లరంబాక్కం పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా రాస్తారోకోతో పుల్లరంబాక్కం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
బంధువుల రాస్తారోకో
రెండు గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం

టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం