గ్రీవెన్స్‌డేలో 533 వినతులు | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌డేలో 533 వినతులు

Jun 17 2025 5:34 AM | Updated on Jun 17 2025 5:34 AM

గ్రీవెన్స్‌డేలో 533 వినతులు

గ్రీవెన్స్‌డేలో 533 వినతులు

తిరువళ్లూరు: తిరువళ్లూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో 533 వినతులు వచ్చినట్టు కలెక్టర్‌ ప్రతాప్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రీవెన్స్‌డేను నిర్వహించారు. గ్రీవెన్స్‌డేకు అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరుకాగా, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. పట్టాల కోసం 86 వినతులు, పక్కా గృహాల కోసం 22, ఉపాధి కోసం 76, మౌలిక సదుపాయాలు సహా ఇతర వాటి కోసం 228 వినతులతో కలిపి మొత్తం 533 వినతులు వచ్చాయి. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేసిన కలెక్టర్‌ ప్రతాప్‌, వాటిని తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గంట పాటు అధికారులతో గత వారం స్వీకరించిన వినతులపై సమీక్ష నిర్వహించారు. పరిష్కరించిన వినతులు, పెండింగ్‌ వివరాలపై ఆరా తీశారు. అనంతరం మహిళలు, వికలాంగుల నుంచి వినతి పత్రాల స్వీకరించారు. డీఆర్వో రాజ్‌కుమార్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ జయకుమార్‌, గ్రీవెన్స్‌డేకు రెవెన్యూ, పోలీసులు, పీడబ్ల్యూడీ, గ్రామీణాభివృద్ధి, అగ్నిమాపకశాఖ, ఎడ్యుకేషన్‌, సర్వేయర్‌ విభాగ అధికారులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement