క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jun 15 2025 8:23 AM | Updated on Jun 15 2025 8:23 AM

క్లుప

క్లుప్తంగా

మహిళ నుంచి

తుపాకీ స్వాధీనం

అన్నానగర్‌: కోవై విమానాశ్రయంలో ఓ మహిళ నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నా రు. కోయంబత్తూరు విమానాశ్రయంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు శనివారం ఉ దయం సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ స్థితిలో బెంగళూరుకు విమానంలో శిక్షణ కోసం వచ్చిన మహిళా ప్రయాణికురాలు సర ళా రామకృష్ణన్‌ లగేజీని తనిఖీ చేశారు. ఆ స మయంలో ఆమె బ్యాగులో 9 ఎంఎం తుపాకీ ఉన్నట్టు గుర్తించారు. సరళా రామకృష్ణన్‌ను పీలమేడు పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆమె కోయంబత్తూరులోని రెడ్‌ఫీల్డ్‌ ప్రాంతానికి చెందిన మహిళ అని, కోయంబత్తూరులోని ఒక ప్రసిద్ధ కార్పొరేట్‌ గ్రూప్‌ ట్రస్టీ భార్య అని తెలిసింది. బెంగళూరుకు వెళ్లేటప్పుడు ఆమె గమనించకుండా తుపాకీ తీసుకెళ్లిందని తేలింది. ఈ విషయంపై పీలమేడు పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వర్షపు నీటిని తొలగించండి

పళ్లిపట్టు: పళ్లిపట్టు బజారువీధిలో గాంధీ విగ్రహం వద్ద వర్షపు నీటితో పాటు మురుగునీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పళ్లిపట్టు టౌన్‌ పంచాయితీలోని బజారులో వందకు పైబడిన దుకాణాలు వున్నాయి. నిత్యం రద్దీగా వున్న ప్రాంతంలో నివాసాలు సైతం అధిక సంఖ్యలో ఉన్నాయి. బజారులోని మురుగునీటి కాలువను పట్టణ పంచాయతీ పారిశుధ్య కార్మికులు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో మురుగునీటి కాలువ నిండి పొంగి రోడ్డులో ప్రవహిస్తోంది. ఈక్రమంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్షపు నీటితో పాటు మురుగునీరు కలిసి రోడ్డులో పేరుకుపోయింది. అందులో దోమలు వ్యాప్తి చెంది దుర్వాసన చోటుచేసుకోవడంతో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. పట్టణ పంచాయతీ నిర్వాహకులు పారిశుధ్య పనులు చేపట్టి మురుగునీటి కాలువలు శుభ్రం చేసి వర్షపు నీరు రోడ్డులో నిల్వచేరకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఒకే వేదికపైకి

క్యాన్సర్‌ విజేతలు

సాక్షి, చైన్నె: క్యాన్సర్‌ను జయించిన వారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే విధంగా శనివారం చైన్నెలో క్యాన్సర్‌ సర్వైవర్స్‌ మీట్‌–2025 కార్యక్రమం జరిగింది. వీఎస్‌ మెడికల్‌ ట్రస్ట్‌ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి క్యాన్సర్‌ విజేతల 200 మందికి పైగా హాజరయ్యారు. మురుగప్ప గ్రూప్‌ మాజీ చైర్మన్‌ ఎంఎం.మురుగప్పన్‌, రామ్‌రాజ్‌కాటన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ కేఆర్‌ నాగరాజన్‌, దర్శకుడు ఆర్‌కే సెల్వమణి కార్యక్రమానికి హాజరై క్యాన్సర్‌ విజేతలను సత్కరించారు. వీఎన్‌సీటీ గ్లోబల్‌కు చెందిన నాగు చిదంబరం, గీత, ఎమరాల్డ్‌ టైర్స్‌కు చెందిన తిరుపతి, కన్నగి, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మద్రాసుకు చెందిన రవి సుందరేశన్‌లకు హార్ట్‌ ఆఫ్‌ గోల్డ్‌ అవార్డులను ప్రదానం చేశారు. డాక్టర్‌ ఎస్‌ సుబ్రమణియన్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేయదని, ఇది ఆత్మను కూడా భారంగా మార్చేస్తుందన్నారు. ఈ రుగ్మతను జయించి ప్రాణాలతో బయటపడిన వారిని చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు.

పోలీసు అధికారి ఇంటిపై

ఏసీబీ దాడులు

అన్నానగర్‌: ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఫిర్యాదు మేరకు, అవినీతి నిరోధక శాఖ పోలీసులు ఒక స్పెషల్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఇంటిపై దాడులు చేశారు. సోదాలు చేసి, పలు పత్రాలను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. హోసూరు మత్తం అగ్రహారం ప్రాంతంలో చందిరాయన్‌ నగర్‌ నివాసి కృపానందం (53) నార్కోటిక్స్‌ కంట్రోల్‌ యూనిట్‌లో 32 ఏళ్లుగా స్పెషల్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని స్వస్థలం ధర్మపురి జిల్లాలోని సెక్కరపటి. కృపానందం తన ఆదాయం కంటే అధిక ఆస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదుల నేపథ్యంలో కృష్ణగిరి, సేలం జిల్లా అవినీతి నిరోధక శాఖ పోలీసులు శుక్రవారం అతని ఇంటిపై దాడులు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన సోదాల్లో, అతని ఇంట్లో రూ.60 వేల నగదు, 20 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణ తర్వాత డబ్బు, ఆభరణాలను వారికి అప్పగించారు. అలాగే, కృపానందం, అతని భార్య, పిల్లల పేర్లపై స్థిర, చరాస్తులను కొనుగోలు చేశారా? అని విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై జరుగుతున్న దర్యాప్తు కోసం కృపానందంను వ్యక్తిగతంగా హాజరు కావాలని అవినీతి నిరోధక పోలీసు అధికారులు కోరారు.

క్లుప్తంగా1
1/1

క్లుప్తంగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement