
భోజనం తరువాత తన గదిలోకి వెళ్లాడు. ఆదివారం ఉదయం 8 ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో
తిరువళ్లూరు: అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఓ ఎస్ఐ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరువళ్లూరు జిల్లా కాకలూరు బైపాస్రోడ్డు ప్రాంతానికి చెందిన తనిగవేలు(49). తిరువళ్లూరు పరిధిలో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య గీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతను కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం యథావిధిగా విధులకు హాజరై శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. భోజనం తరువాత తన గదిలోకి వెళ్లాడు. ఆదివారం ఉదయం 8 ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో భార్య గీత తలుపు తెరిచి చూడగా ఉరి వేసుకుని శవంగా కనిపించాడు. విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.