కబడ్డీ చాంపియన్‌గా సూర్యాపేట జిల్లా జట్టు | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ చాంపియన్‌గా సూర్యాపేట జిల్లా జట్టు

Dec 29 2025 9:18 AM | Updated on Dec 29 2025 9:18 AM

కబడ్డీ చాంపియన్‌గా సూర్యాపేట జిల్లా జట్టు

కబడ్డీ చాంపియన్‌గా సూర్యాపేట జిల్లా జట్టు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్‌ కబడ్డీ చాంపియన్‌ షిప్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. పురుషుల విభాగంలో సూర్యాపేట జిల్లా జట్టు చాంపియన్‌ షిప్‌ను కై వసం చేసుకోగా.. మహిళల విభాగంలో హైదరాబాద్‌–2 జట్టు విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో రన్నర్‌గా జోగులాంబ గద్వాల్‌ జట్టు, తృతీయస్థానాల్లో నిజామాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ నిలిచాయి. మహిళల విభాగంలో రన్నర్‌గా రంగారెడ్డి జిల్లా జట్టు, తృతీయ స్థానాల్లో వరంగల్‌, ఖమ్మం జట్లు నిలిచాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్‌ పాలసీ తీసుకొచ్చిందన్నారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్‌.సంపత్‌రావు, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, జిల్లా కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ అమిత్‌ కుమార్‌, మల్లేశంగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement