
వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృ తాభిషేకం గావించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం చేపట్టి కల్యాణం జరిపారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రవేశంగావించి మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెండు తెలుగురాష్ట్రాల నుంచి వవ్చిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, నరసింహాచార్యులు, శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణం