టీడీపీకి అనుకూలంగా పంచాయతీల పునర్విభజన | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి అనుకూలంగా పంచాయతీల పునర్విభజన

Dec 23 2025 6:51 AM | Updated on Dec 23 2025 6:51 AM

టీడీపీకి అనుకూలంగా పంచాయతీల పునర్విభజన

టీడీపీకి అనుకూలంగా పంచాయతీల పునర్విభజన

టీడీపీకి అనుకూలంగా పంచాయతీల పునర్విభజన ● పీజీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్‌ ఫిర్యాదు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో పలు పంచాయతీల పునర్విభజన అశాసీ్త్రయంగా జరుగుతోందని, టీడీపీకి అనుకూలంగా విభజన చేస్తున్నారని, దీనిపై పునరాలోచన చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభు త్వం ఇటీవల పంచాయతీల విభజన చేసే ప్రక్రియలో భాగంగా కొత్తగా గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అందు లో భాగంగా సారవకోట మండలంలో అలుదు, జలుమూరు మండలంలో అంధవరం, దరివాడ, పోలాకి మండలంలో బొద్దాం, నరసన్నపేట మండలంలో మడపాం, వి.ఎన్‌.పురం పంచాయతీల పరిధిలో గ్రామాలను వేరుచేసి కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. సర్పంచ్‌, కార్యవర్గ ఆమోదం, తీర్మానం లేకుండా కొందరు వ్యక్తులు సమర్పించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం తగదన్నారు. పంచాయతీ, ప్రజామోదం మేరకే విభజన చేయాలని కోరారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్‌, వాన గోపి, ముద్దాడ బైరాగి నాయుడు, కనపల శేఖర్‌రావు, రౌతు శంకరరావు, పైడి విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement