
పుస్తెలతాడు చోరీ
సంతబొమ్మాళి: బోరుభద్ర గ్రామంలో మార్పు అప్పన్నమ్మకు చెందిన రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీకి గురైనట్లు సంతబొ మ్మాళి ఎస్ఐ వై.సింహాచలం తెలిపారు. బుధవారం ఉదయం అప్పన్నమ్మ తన కన్నవారిల్లు ఉన్న నగిరిపెంట గ్రామానికి వెవెళ్లింది. తిరిగి బోరుభద్ర వచ్చేందుకు నగిరిపెంట జంక్షన్ వద్ద బస్సు కోసం వేచి ఉండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలో పుస్తెలతాడు తెంచుకుని పారిపోయా రు. బాధితురాలు కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రజల్లో న్యాయవిజ్ఞానం విస్తృతంగా వ్యాప్తి చెందడానికి, చట్టాలపై అవగాహన పెంచడానికి పారా లీగల్ వలంటీర్లకు సమగ్ర శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పారా లీగల్ వలంటీర్లకు మ జిల్లా న్యాయ సేవా సదన్లో నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ బుధవారం ప్రారంభించారు. వివిధ పథకాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, న్యాయవాదులు అన్నెపు భువనేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
బూర్జ: ఆమదాలవలస–పాలకొండ ప్రధాన రహదారిలో నీలాదేవిపురం మలుపు వద్ద ద్విచక్ర వాహనం ముందుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి గోతులో పడటంతో యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు విజయనగరం జిల్లా గరివిడి మండలం చేరిపేటకు చెందిన కె.సంతోష్గా గుర్తించారు. అదే బైక్పై వెనుక కూర్చున్న నమ్మి కనకరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వీరు బుధవారం సాయంత్రం పార్వతీపురంలో ఓ శుభకార్యం ఫొటోషూట్ తీసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. హెచ్సీ ఉమామహేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు.
సిక్కోలు పుస్తక మహోత్సవం లోగో ఆవిష్కరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో నవంబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న సిక్కోలు పుస్తక మహోత్సవం సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాలు విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ ఆకాంక్షించారు. ఈ మేరకు తన చాంబర్లో సిక్కోలు పుస్తక మహోత్సవం లోగోను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహోత్సవం కన్వీనర్ కె.శ్రీనివాసు, సాంస్కతిక వైజ్ఞానిక కన్వీనర్లు పి.సుధాకరావు, గొంటి గిరిధర్, కామినాయుడు, దొంతం పార్వతీశం, కె.కూర్మారావు, పి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
చెకుముకి సైన్స్సంబరాలు పోస్టర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చెకుముకి సైన్స్ సంబరాలకు మంచి ఆదరణ లభిస్తోందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ అన్నారు. జేవీవీ ఆధ్వర్యంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు రూపొందించిన 8వ తరగతి ఎన్ఎంఎంఎస్ పరీక్షల స్టడీ మెటీరియల్, చెకుముకి సైన్స్ పోస్టర్ను జేసీ బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్, ఉపాధ్యక్షుడు పి.కూర్మారావు, జిల్లా కార్యదర్శి పి.గోవిందరావు, జిల్లా ఆడిట్ కన్వీనర్ బి.ఉమామహేశ్వరరావు, డి.పార్వతీశం పాల్గొన్నారు.

పుస్తెలతాడు చోరీ

పుస్తెలతాడు చోరీ

పుస్తెలతాడు చోరీ