రణస్థలం: మండలంలోని పైడిభీమవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 8 సీసీ కెమెరాలు, వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల కిందట దొంగిలించారు. ఈ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. దీనిపై పాఠశాల సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్సై చిరంజీవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దివ్యాంగులను ప్రోత్సహిద్దాం
శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల్లో సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన ది వ్యాంగుల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజ్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవితతో కలిసి వినతులు స్వీకరించారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ శ్రీకాకుళం కార్యాలయ అధికారులు, సిబ్బంది దరఖాస్తుదారులను కూర్చోబెట్టి మంచినీళ్లు, టీ, స్నాక్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్ పాల్గొన్నారు.
పైడిభీమవరం హైస్కూల్లో సీసీ కెమెరాలు చోరీ