కుమ్మరవాండ్లపల్లిలోని ఆ ఇంట్లో పేలుడు పదార్థాలున్న విషయం మా దృష్టికి రాలేదు. స్థానికులు ఎవరైనా సమాచారం ఇచ్చి ఉంటే చర్యలు తీసుకునేవాళ్లం. ఎక్కడైనా ఇలాంటి పేలుడు పదార్థాలు నిల్వలు ఉన్నా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా... సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం.
– శివనారాయస్వామి, డీఎస్పీ, కదిరి
పోలీసులను ఉద్యోగం చేయనిస్తే కదా?
చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ఉద్యోగం చేయనీయడం లేదు. నిత్యం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టాలని వారిపై ఒత్తిడి తెస్తోంది. అందుకే ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. శాంతి భద్రతలు రోజురోజుకూ క్షీణించిపోతున్నాయి. అసాంఘిక శక్తులు పేట్రేగి పోతున్నాయి. –పూల శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్సీపీ


