బూతు రాతలపై వైఎస్సార్‌సీపీ నిరసన | - | Sakshi
Sakshi News home page

బూతు రాతలపై వైఎస్సార్‌సీపీ నిరసన

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

మావిగన్‌ రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ చానల్‌లో రాధాకృష్ణ రాసిన, ప్రసారం చేసిన బూతు రాతలు, రోత వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని ఆ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టాయి. వైఎస్సార్‌సీపీ కుటుంబాలకు చెందిన మహిళలను ప్రత్యేకించి రాధాకృష్ణ రాతలు, వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఆ పత్రిక, చానల్‌ యజమాని తీరును ఖండిస్తూ చేపట్టిన ఆందోళనలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement