
ఆర్టీసీ బస్సు ఢీకొని..
ముత్తుకూరు (పొదలకూరు): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్చార్జి ఎస్సై శ్రీనివాసులురెడ్డి వివరాల మేరకు.. చలివేంద్రం గ్రామానికి చెందిన కార్తీక్ (19), హర్షవర్ధన్ బైక్పై బయల్దేరారు. ఈ క్రమంలో ముత్తుకూరు సమీపంలోని మద్దిమాను వద్ద వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఘటనలో కార్తీక్ (19) మృతి చెందగా, హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో క్షతగాత్రుడు చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.