లారీని తప్పించబోయి.. | - | Sakshi
Sakshi News home page

లారీని తప్పించబోయి..

Aug 1 2025 12:41 PM | Updated on Aug 1 2025 12:41 PM

లారీని తప్పించబోయి..

లారీని తప్పించబోయి..

రోడ్డు ప్రమాదంలో

ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ మృతి

కావలి(జలదంకి): రోడ్డు ప్రమాదంలో ఓ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ మృతిచెందాడు. కావలి రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన కోదాటి రాజు (47) ట్రావెల్స్‌ బస్సు డ్రైవరుగా పని చేస్తున్నాడు. అతడికి భార్య సంధ్య, ముగ్గురు పిల్లలున్నారు. బుధవారం సాయంత్రం 4:45 గంటలకు రాజు ఏలూరు నుంచి బెంగళూరుకు బయలుదేరిన బస్సుకు డ్రైవర్‌గా ఉన్నాడు. రాత్రి 11:50 గంటల సమయంలో కావలి మండలం అడవిరాజుపాళెం దాటిన తర్వాత పెట్రోల్‌ బంకు సమీపంలో జాతీయ రహదారిపై లారీ వెళ్తోంది. దాని డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో రాజు లారీని తప్పించేందుకు స్టీరింగ్‌ను ఎడమవైపునకు తిప్పాడు. ఆ సమయంలో మరో లారీ వెళ్తుండగా దానిని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు స్టీరింగ్‌, సీటు మధ్యలో ఇరుక్కుని మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ప్రయాణులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కావలి రూరల్‌ సీఐ రాజేశ్వరరావు గురువారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement