ఐపీఎల్‌లో సెంచ‌రీ కొట్టిన అర్ష్‌దీప్‌ | Punjab Kings Bowler Arshdeep Singh Reaches 100 Wickets Milestone IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో సెంచ‌రీ కొట్టిన అర్ష్‌దీప్‌

Apr 16 2026 9:08 PM | Updated on Apr 16 2026 10:01 PM

Punjab Kings Bowler Arshdeep Singh Reaches 100 Wickets Milestone IPL

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ బౌల‌ర్ అర్ష్‌దీప్ సింగ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. అయితే అర్ష్‌దీప్ సెంచ‌రీ న‌మోదు చేసింది బ్యాటింగ్‌లో అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే బౌలింగ్‌లో అర్ష్‌దీప్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో ఓపెన‌ర్ రికెల్‌ట‌న్‌ను ఔట్ చేయ‌డం ద్వారా అర్ష్‌దీప్‌ ఐపీఎల్‌లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. 

ఐపీఎల్‌లో వంద వికెట్లు సాధించి ఐదో లెఫ్టార్మ్ పేస‌ర్‌గా, నాలుగో భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు. ఇంత‌క‌ముందు ట్రెంట్ బౌల్ట్ (144 వికెట్లు), ఉనాద్క‌ట్ (114 వికెట్లు), ఆశిష్ నెహ్రా (106 వికెట్లు), జ‌హీర్ ఖాన్ (102 వికెట్లు) ముందున్నారు. ఇక ప‌వ‌ర్ ప్లేలో అర్ష్‌దీప్ వికెట్ తీసుకోవ‌డం 11 ఇన్నింగ్స్‌ల త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
 
Advertisement
Advertisement