Paris Olympics 2024: సెమీస్‌కు చేరిన భారత హాకీ జట్టు | Paris Olympics 2024: India Beat Great Britain In Mens Hockey Quarter Finals, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: సెమీస్‌కు చేరిన భారత హాకీ జట్టు

Aug 4 2024 3:34 PM | Updated on Aug 4 2024 4:43 PM

Paris Olympics 2024: India Beat Great Britain In Mens Hockey Quarter Finals

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్‌కు చేరింది. ఇవాళ (ఆగస్ట్‌ 4) జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ పెనాల్టీ షూటౌట్‌లో గ్రేట్‌ బ్రిటన్‌పై 4-2 తేడాతో గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు చెరో గోల్‌ సాధించాయి. 

ఈ మ్యాచ్‌లో భారత్‌ 40 నిమిషాలకు పైగా పది మంది ప్లేయర్లతోనే ఆడింది. మ్యాచ్‌ తొలి అర్ధ భాగంలో అమిత్‌ రోహిదాస్‌ రెడ్‌ కార్డ్‌కు గురయ్యాడు. ఒలింపిక్స్‌లో భారత్‌ సెమీస్‌కు చేరడం ఇది వరుసగా రెండోసారి. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement