భారత్‌కు వచ్చేందుకు పాక్‌ క్రికెట్‌ టీమ్‌ నిరాకరణ..? | Pakistan Women Refuse To Travel India For Women's WC Opening Ceremony Says Report | Sakshi
Sakshi News home page

భారత్‌కు వచ్చేందుకు పాక్‌ క్రికెట్‌ టీమ్‌ నిరాకరణ..?

Sep 6 2025 12:14 PM | Updated on Sep 6 2025 12:18 PM

Pakistan Women Refuse To Travel India For Women's WC Opening Ceremony Says Report

మహిళల వన్డే ప్రపంచ కప్‌ ఓపెనింగ్‌ సెర్మనీ కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు భారత్‌లో అడుగుపెట్టేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌కు ముందు గౌహతిలోని బార్సపరా స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగాల్సి ఉన్నాయి. ఇందు కోసం టోర్నీలో పాల్గొనే జట్లన్నీ హాజరుకానున్నాయి. అయితే భారత్‌తో సత్సంబంధాలు లేని కారణంగా పాక్‌ ఈ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ఓపెనింగ్‌ సెర్మనీలో ప్రముఖ బాలీవుడ్‌ గాయని శ్రేయా ఘోసల్‌తో లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ ఏర్పాటు చేయబడింది. ఈ వేడుకను ఐసీసీ గ్రాండ్‌గా ప్లాన్‌ చేసింది. ఓపెనింగ్‌ సెర్మనీ అనంతరం కెప్టెన్ల ఫోటో షూట్‌, ప్రత్యేక మీడియా సమావేశం కూడా జరునున్నాయి. వీటికి కూడా పాక్‌ దూరం కానుందని సమాచారం.

భారత్–పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 2008 నుంచి నిలిచిపోయిన విషయం​ తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ సంబంధాలు మరింత క్షీణించాయి. బీసీసీఐ-పీసీబీ ఒప్పందం మేరకు ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడనున్నాయి. అది కూడా తటస్ట్‌ వేదికల్లో మాత్రమే.

త్వరలో ప్రారంభం కాబోయే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది. ఆ జట్టు అక్టోబర్‌ 2న తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 5న కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement