పాపం కోహ్లి.. భయపడి పారిపోయాడు

India Vs England Fan Runs Into Stadium Virat Kohli Pulls Away - Sakshi

కోహ్లిని కలిసేందుకు స్టేడియంలోకి దూసుకొచ్చిన అభిమాని

గాంధీనగర్‌: వీరాభిమాని ఒకరు టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లిని కలవడానికి బయో బబుల్‌ ప్రొటోకాల్‌ని ఉల్లంఘించాడు. స్టేడియంలోకి దూసుకెళ్లాడు. అతడిని గమనించిన కోహ్లి.. వెంటనే కొద్ది దూరం పరిగెత్తి.. సదరు అభిమానిని వెనక్కి తిరిగి వెళ్లాల్సిందిగా కోరాడు. ఈ సంఘటన బుధవారం అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌ మొదటి రోజు చోటు చేసుకుంది. కోహ్లి అలా వెళ్లిపోవడం చూసిన ఆ వీరాభిమాని.. నిరాశగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

కోవిడ్‌ నేపథ‍్యంలో ప్రస్తుతం ఆటగాళ్లందరూ బయో బబుల్‌ సెక్యూరిటీలో ఉన్నారు. బయో బబుల్‌ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ మేరకు ఆటగాళ్లను, మ్యాచ్ అధికారులను ఎవరినీ కలవడానికి అనుమతించరు. మ్యాచ్ ముందు శిక్షణ సెషన్ల సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక అభిమాని ప్రోటోకాల్‌లను ఉల్లంఘించడంపై జీసీఏ అధికారి మాట్లాడుతూ.. "మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాము.. అభిమాని ఎవరో గుర్తించి. అతడిపై చర్యలు తీసుకుంటాము’’ అని తెలిపారు. 

అహ్మాదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం ప్రారంభమైన పింక్‌ బాల్‌ టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 99/3 నిలవగా.. ఇంగ్లండ్‌ 112 పరుగులకు ఆలౌటైంది. రోహిత్‌ (57), అజింక్య రహనె (1) క్రీజులో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top