యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ నోటీసులు.. | ED Summons Former Cricketers Yuvraj Singh & Robin Uthappa in Betting App Promotion Probe | Sakshi
Sakshi News home page

యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ నోటీసులు..

Sep 16 2025 1:17 PM | Updated on Sep 16 2025 3:13 PM

ED Summons Robin Uthappa, Yuvraj Singh Online Betting App Case

బెట్టింగ్ యాప్  ప్రమోషన్ కేసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. తాజాగా భార‌త మాజీ క్రికెట‌ర్లు యువ‌రాజ్ సింగ్‌, రాబిన్ ఉతప్ప‌ల‌కు ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ 1xBet సోషల్ మీడియా ప్రమోషన్‌లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ మాజీ క్రికెట‌ర్ల‌ను ఈడీ విచారించ‌నుంది. 

మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద వారి వాంగ్మూలాలను నమోదు చేయ‌నున్నారు. ఈ నెల 22న ఉత‌ప్ప‌, 23న యువ‌రాజ్ సింగ్‌లు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. వీరిద్ద‌రితో పాటు బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక ఇప్ప‌టికే ఈ కేసులో భార‌త మాజీ క్రికెట‌ర్లు సురేష్ రైనా, శిఖ‌ర్ దావ‌న్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ విచారించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement