వ్యక్తిగత, కుటుంబ వివరాలు పోస్ట్ చేయకూడదు మహిళలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్
ఎలాంటి జాగ్రత్తలు
తీసుకోవాలి?
గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో జాగ్రత్తగా ఉండాలి. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, మేసేజ్లకు స్పందించకూడదు. వారి నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లను కూడా యాక్సెప్ట్ చేయకూడదు. సోషల్ మీడియాలో వచ్చే ఏ ప్రొఫైల్ను గుడ్డిగా నమ్మకూడదు. మహిళలు, అమ్మాయిలు తమ పేర్లు, వ్యక్తిగత, కుటుంబ ఫొటోలు, వివరాలు, ఫోన్ నంబర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు.
సిద్దిపేటకమాన్: ఇటీవల కమిషనరేట్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తితో ఆన్ఆర్ఐ అంటూ ఆన్లైన్లో పరిచయం పెంచుకుని వలపు వలలోకి దించి పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఉన్నత చదువులు చదివిన ఓ అమ్మాయి నుంచి డబ్బులు కాజేసి ఆన్లైన్ మోసానికి పాల్పడ్డాడు. జిల్లాలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ప్రజలు ఆన్లైన్లో గుర్తు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారు పంపే ఫ్రెండ్ రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేయకూడదని, ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు వారి వ్యక్తిగత, కుటుంబ వివరాలు, ఫొటోలు, ఇతర వివరాలు పోస్ట్ చేయకూడదని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్తో ‘సాక్షి’ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు.
పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాలు


