
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
పెద్దశంకరంపేట(మెదక్): సీఎం రేవంత్రెడ్డి పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, బిల్లులు త్వరితగతిన అందజేస్తామన్నారు. ఉచిత ఇసుక ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి మహిళా సంఘాల ద్వారా రూ. 1 లక్ష వరకు రుణం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవాని, నాయకులు సురేందర్రెడ్డి, మధు, నారాగౌడ్, ఆర్ఎన్.సంతోష్, దాచ సంగమేశ్వర్, రాజేందర్గౌడ్, రాములు, శ్రీను, గంగారెడ్డి, అంజిరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ షాకీర్అలీ పాల్గొన్నారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి