
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
హత్నూర(సంగారెడ్డి): అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నస్తీపూర్ సాదులనగర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. బడుగు, బలహీనవర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ సురేందర్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి హకీం, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కృష్ణ, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రాజేందర్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, విఠల్రెడ్డి, వెంకటేశం, సత్యం, సతీష్, కృష్ణతో పాటు మండలంలోని ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్