
సరికొత్త హంగులతో పోలీస్స్టేషన్
ఐజీ సత్యనారాయణ
సైబర్ బాధితులకు సత్వర న్యాయం
జిన్నారం(పటాన్చెరు): సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక వసతులతో మోడల్ పోలీస్స్టేషన్ నిర్మించడం అభినందనీయమని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ అన్నారు. ఆదివారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నూతన పోలీస్స్టేషన్ భవన నిర్మాణానికి ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, హెటిరో పరిశ్రమ ప్లాంట్ డైరెక్టర్ మోహన్రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే అత్యాధునిక పోలీస్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హెటిరో పరిశ్రమ సహకారంతో రూ. 3.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీ ప్రభాకర్, సీఐ రవీందర్రెడ్డి, నరేష్, లాలునాయక్, కమిషనర్ మధుసూదన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొలన్ బాల్రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్రెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, హన్మంత్రెడ్డి, ఆనంద్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జోన్: సైబర్ క్రైంలో కోల్పోయిన డబ్బును తిరిగి చెల్లించడంలో రాష్ట్రంలో జిల్లాకు ఐదో స్థానం దక్కిందని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిషనరేట్లు మినహా జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి మొదటి స్థానంలో నిలిచిందన్నారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ మంచి అవకాశం అన్నారు. ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు జిల్లాలో బృందాలను ఏర్పాటు చేసి డీఎస్పీ స్థాయి అధికారులచే పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన 206 సైబర్ కేసులలో రూ. 1.43 కోట్లను తిరిగి బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంకు నోడల్ అధికారులకు పంపించామని తెలిపారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న వివిధ రకాల 1,279 కేసులు లోక్ అదాలత్లో రాజీ కుదిరిందని తెలిపారు.
కోల్పోయిన డబ్బు చెల్లింపులో జిల్లాకు ఐదో స్థానం
ఎస్పీ పరితోష్ పంకజ్

సరికొత్త హంగులతో పోలీస్స్టేషన్